టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
posted on Jul 31, 2025 3:30PM
.webp)
భారత- ఇంగ్లాండ్ మధ్య ఓవల్లో జరుగుతున్నచివరి టెస్ట్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ను గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ చూస్తుండగా భారత్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను డ్రా చేయాలని పట్టుదలతో ఉంది. గతంలో ఓవల్ పిచ్పై మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు మాత్రమే విజయం సాధించింది.
జట్లు..
ఇంగ్లాండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, జాకబ్, స్మిత్, వోక్స్, అట్కిన్సన్, ఓవర్టన్, జోష్.
భారత్: జైస్వాల్, కేఎల్ రాహుల్, సుదర్శన్, గిల్, కరుణ్, జడేజా, జురెల్, వాషింగ్టన్, అన్షుల్, ప్రసిద్ధ్, సిరాజ్.