Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహీంద్రా కంపెనీకి లోకేష్ ఆహ్వానం.. రియాక్ట్ అయిన ఆనంద్ మహీంద్ర
posted on: Jul 19, 2025 5:09PM

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి' అంటూ ఆ యాడ్కు తెలుగు క్యాప్షన్ రాశారు.
దానికి స్పందనగా రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మహీంద్రా గ్రూప్ ఏపీలో టక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ను ఆయన ఆహ్వానించారు.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామన్నారు.
ఏపీలో పరిశ్రమ స్థాపనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, మహీంద్రా సంస్థ దీనిపై ఆలోచించాలని కోరారు. దీనిపై నేడు ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... మున్ముందు ఏం జరగనుందో చూద్దాంఃఅని ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.






