Latest News

చెర్రీకి అక్కడ కూడా ఎక్కువేనంట

posted on: Jan 18, 2014 4:06PM

 

చరణ్ నటించిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ఎమిజాక్సన్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించడంతో తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. "చరణ్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చెర్రీతో డాన్సులు చేసే ఛాన్స్ దొరికింది. బాలీవుడ్ లో చరణ్ కు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దర్శకుడు వంశీ నా పాత్రను అద్భుతంగా తెరకెక్కించారు. దిల్ రాజు బ్యానర్లో పనిచేయటం ఎప్పటికి మర్చిపోలేను. ఈ సినిమా విజయం నాలోని కాన్ఫిడెన్స్ ను మరింతగా పెంచింది. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్" అని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...