క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్... బెయిల్ పై రిలీజ్

 

భారత క్రికెటర్, స్పిన్నర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. యువతిపై దాడి కేసులో సుమారు మూడు గంటల పాటు అమిత్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు... అనంతరం అరెస్టు చేశారు. అయితే మిశ్రా లాయర్లు బెయిల్ పేపర్లు దాఖలు చేయడంతో వెంటనే రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25న బెంగళూరులో తానుంటున్న హోటల్ గదికి వచ్చిన ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు మిశ్రాపై కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే మంగళవారం దాదాపు మూడు గంటలపాటు మిశ్రాను ప్రశ్నించి వదిలిపెట్టారు, అయితే అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదైందని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని బెంగళూర్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu