Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాం
posted on: Jan 8, 2014 4:21PM

అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం స్పీకర్ నాదెండ్లమనోహర్, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క స్థలాన్ని పరిశీలించారు. మహాత్మా గాంధీ విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిర్ణయించినట్లు తెలియవచ్చింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 22న విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 500 కేజీల బరువు గల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లో తయారు చేయించారు. దీనికి అయ్యే ఖర్చు రూ. 23 లక్షలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.



.jpg)


