Latest News

పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం

posted on: Jun 18, 2025 3:15PM

 

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం జగన్, సత్తెనపల్లి  పర్యటన సందర్బంగా నేపథ్యంలో ముందుగా జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు బారికేట్లు పెట్టారు. వైసీపీ వాహనాలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నరు. దీంతో అంబటి రాంబాబు బారికేడ్లను తొలిగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలతో కలిసి బారికేడ్లను పక్కకు నెట్టేశారు. వాహనాలతో ర్యాలీగా వెళ్లి తీరుతామని అంబటి హడావుడి చేయడంతో ఆయనకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి చొచ్చుకెళ్లేందుకు అంబటి రాంబాబు యత్నించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...