నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ అమలు

posted on: Oct 29, 2015 11:17AM

 

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది, ఇప్పటికే 33వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తోంది, అమరావతి ప్రాంతంలో ఇంకా సుమారు 300 ఎకరాలు భూమి అవసరం కానుందని, అందుకే నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు, సమీకరణ ద్వారానే రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అందుకు మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని, రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ఆయన తెలిపారు, భూసేకరణ చట్టం అమలుపై ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందని, ఇక రాజీపడే ప్రసక్తే లేదన్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...