అమరావతిలో కాపులకు చోటు ఎందుకివ్వలేదు?
posted on: Oct 26, 2015 5:30PM

అమరావతి శంకుస్థాపన కార్యక్రమ వేదికపై కాపు నాయకులకు ఎందుకు చోటివ్వలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు, వేదికపైకి కాపు నాయకులను పిలవకపోవడం అవమానకరంగా ఉందని, ఇది కాపులను అవమానించడమేనని అన్నారు, డిప్యూటీ సీఎం చినరాజప్ప లేదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ శంకుస్థాపన వేదికగా గౌరవించలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మండిపడ్డారు, ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదని ఆరోపించారు, కాపులను బీసీల్లో చేర్చుతామని, 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చంద్రబాబును కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు




.jpg)


