ఒక్క మాట చెప్పి ఊరుకుంటారా? మోడీపై ఏపీ ప్రజల ఆగ్రహం

posted on: Oct 23, 2015 10:33AM

 

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు ఎందరెందరో ప్రముఖులు, రాజధాని ప్రజలు అంతా కలిసివచ్చారు. అయితే అంతా బానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రజలు మోదీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీయే సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని గత కొంతకాలం నుండి చెపుతున్నా కాని ఇప్పటి వరకూ దాని మీద ఓ క్లారిటీ ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు సమయం తీసుకున్న మోడీ ఏపీ శంకుస్థాపన రోజైన ఏదో ఒక తీపి ప్రకటన చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన మోడీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఒక్క మాట చెప్పి ఊరుకున్నారు. దీంతో ఏపీ ప్రజలు మోడీపై మంటక్కిపోతున్నారు. కనీసం ఏదో ఒక చిన్న చిన్న వరాలు కూడా ఇవ్వకుండా ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...