Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...5 నిమిషాల టైం ఇవ్వండి మోడీ.. కాంగ్రెస్ ఎంపీలు
posted on: Oct 14, 2015 11:26AM
.jpg)
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జైరామ్ రమేశ్, జేడీ శీలం ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలందరూ కలిసి ప్రధానికి ఓ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తమకు ప్రత్యేక హోదా గురించి.. ప్రత్యేక ప్యాకేజీల మాట్లాడేందుకు ఓ ఐదు నిమిషాల టైం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నేరవేర్చాలని అన్నారు. అలాగే హామీలను ఎవరు అమలు చేశారన్నది ముఖ్యం కాదని అమలయ్యాయా లేదా? అన్నదే ప్రధానమని శీలం విలేకరులతో చెప్పారు. మరి మోడీ వాళ్లకి టైం కేటాయిస్తారో లేదో చూడాలి.


.jpg)



