Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బడ్జెట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం
posted on: Jan 31, 2025 8:55AM

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో 1925-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి విదితమే. కాగా లోక్ సభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా జరిగే ఈ బడ్జెట్ సమావేశాలలో మొదటి విడత సమావేశాలు శుక్రవారం (జనవరి 31)న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతాయి.
ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జనవరి 31) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఆ రోజు కు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 1)న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.
ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 30) అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ పడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరు కాగా కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా రాజ్ నాథ్ సింగ్ సభ్యులను కోరారు.






