TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అతనితోనే వారసుడిని పరిచయం చేస్తాడా...?

Published on: Mon Nov 4, 2013 11:39AM

 

"అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ చేయబోయే చిత్రం ఎవరితో అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటి వరకు పవన్, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో కలిసి త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ జాబితాలోకి అక్కినేని అఖిల్ కూడా వచ్చేసాడు. అఖిల్ సినిమా రంగ ప్రవేశాన్ని త్రివిక్రమ్ వంటి దర్శకుడితో పరిచయం చేయాలని నాగార్జున అనుకొని, త్రివిక్రమ్ ను కోరగా... దానికి త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జునే స్వయంగా నిర్మించనున్నాడని తెలిసింది. మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.