అంగరంగ వైభవంగా 'అఖిల్' ఆడియో

కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల మధ్య అక్కినేని అఖిల్ లాంఛింగ్ ఫిల్మ్ 'అఖిల్' ఆడియో విడుదలైంది. గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పాటల వేడుకలో అక్కినేని నాగార్జున దంపతులతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు, ఇక అఖిల్ ను ఆశీర్వదించడానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జునతో కలిసి ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్....అఖిల్ రూపంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద హీరోను అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక నాగార్జున మాట్లాడుతూ...కృష్ణ గారితో వారసుడు సినిమాలో నటిస్తే, ఆయన వారసుడు వచ్చి, నా వారసుడ్ని ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. అనూప్‌ రూబెన్స్, తమన్ సంయుక్తంగా సంగీతమందించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.