రెడ్డి సోదరులకు జైలే: ఎంఐఎం అక్బరుద్దీన్
posted on Mar 23, 2013 2:38PM
కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం కాదని అక్బరుద్దీన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసంహరించాక నా మీద కేసులు పెట్టి అరెస్టు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడగానే ఆయనపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జైలుపాలు చేశారు. అయితే భవిష్యత్ లో రెడ్డి సోదరులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు” అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులను హెచ్చరించారు. అయితే అక్బరుద్దీన్ అరోపణలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను ఎవరిమీద వ్యక్తిగతంగా కేసులు పెట్టించలేదని, కేసులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు.