TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

70 లక్షలకి టోపీ పెట్టిన పోలీసు పెద్దాయన

Published on: Wed Apr 8, 2015 4:48PM

 

ప్రస్తుతం పోలీసులు చేసిన త్యాగాలను అందరూ స్మరించుకుంటున్నారు. ఇప్పుడు మరోరకం పోలీసు అధికారి గురించి వెలుగులోకి వచ్చింది. అడిషనల్ డీజీగా పనిచేసి రిటైరైన ఓ పెద్దాయన ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడి నుంచి 70 లక్షలు వసూలు చేశాడు. ఎంబీబీఎస్ సీటు కోసం తనను ఆశ్రయించిన వ్యక్తికి బాగా నమ్మకంగా మాటలు చెప్పిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారి అతన్ని చక్కగా మోసం చేశాడు. ఎంబీబీఎస్ సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వవయ్యా మగడా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాజీ పోలీసు అధికారి మీద కేసు నమోదు చేశారు.