Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డాక్టర్ పై మహిళ యాసిడ్ దాడి
posted on: Feb 7, 2019 11:17AM

ప్రేమించట్లేదనో లేక ప్రేమించి మోసం చేసిందనో.. అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ తోనో లేక కత్తితోనో దాడి చేయడం చూస్తుంటాం. అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అబ్బాయిలకు కూడా పరిచయం చేస్తున్నారు అమ్మాయిలు. తాజాగా ఒక మహిళ ఓ వ్యక్తిపై యాసిడ్ తో దాడి చేసి భయపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్ ఆదర్శ్రెడ్డిపై ఓ మహిళ గురువారం నాడు యాసిడ్ దాడికి పాల్పడింది. విడాకుల కేసులో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి గురువారం నాడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలో ఆదర్శ్ రెడ్డి వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ బురఖా వేసుకొని వచ్చి యాసిడ్తో దాడికి ప్రయత్నించింది. అయితే ఈ ఘటనలో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని డాక్టర్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.






