ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం.. పలువురికి గాయాలు
posted on Jun 12, 2025 9:06AM
హీరో నిఖిల్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ చిత్రం షూటింగ్ లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ సినిమా షూటింగ్ కోసం శంషాబాద్ సమీపంలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లో కీలకమైన సముద్రం సన్నివేశాలు చిత్రీకరించేందుకు స్విమ్మింగ్ పూల్ సెట్ వేశారు. అయితే సముద్రం ఎఫెక్ట్ రావడం కోసం భారీ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.
అయితే బుధవారం (జూన్ 11) ఈ భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో నీరు నిజంగానే సముద్రంలా మారి సెట్ ను ముంచేసింది. ఈ ప్రమాదంలో కెమెరాలు, ఇతర వస్తువులు మునిగిపోయాయి. అసిస్టెంట్ కెమేరామెన్ సహా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.