తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర?

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి తెరాస కుట్రలు పన్నిందని రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా తెదేపాపై సరిగ్గా అటువంటి ఆరోపణలే చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు కనబడుతోంది. తెదేపా ఎమ్మేల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇద్దరూ ఏకంగా 29 మంది తెరాస ఎమ్మేల్యేలతో టచ్చులో ఉన్నారని, వారిరువురూ తెలంగాణా ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారిరువురి కాల్ డాటా ఆధారంగా ఎసిబి అధికారులు ఈ సంగతి కనుగొన్నట్లు మీడియాలో లీకులు వస్తున్నాయి.కనుక నేడో రేపో వారి సంభాషణలని కూడా మీడియాకు రిలీజ్ చేస్తారేమో?