కలాం మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

 

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. కలాం మరణంతో భారతదేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను, దార్శికుడిని, స్ఫూర్తి ప్రదాతను కోల్పోయిందని చంద్రబాబు నాయుడు తన సంతాప సందేశంలో తెలిపారు.