కలాం సర్ అంత్యక్రియలు పూర్తి

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే రామేశ్వరంలోఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి ఇస్లాం మతాచారాల ప్రకారం పూర్తి చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య, ఇంకా అనేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాధిపతులు, వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆ మహనీయుడికి అంతిమ వీడ్కోలు పలికారు.