ఆప్ కు షాక్... బీజేపీలోకి ఎమ్మెల్యే..

posted on: Mar 27, 2017 3:14PM

 

ఆప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్ అయి పార్టీకి ఝలక్ ఇచ్చారు. భావన నియోజకవర్గం ఎమ్మెల్యే వేదప్రకాశ్‌ సతీశ్‌ ఆప్‌కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. బీజేపీ చీప్‌ మనోజ్‌ తీవారి సమక్షంలో వేదప్రకాశ్‌ కమలం కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్‌ విఫలమైందని, ఇకపై ఆ పార్టీలో కొనసాగడం చాలా కష్టమని అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...