Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో వివాదంలో ఆప్.. బెదిరింపు కేసులో ఆప్ నేత
posted on: Jun 25, 2015 5:57PM

ఆప్ ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీ నేతలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికేట్లతో మోసం చేసినందుకు గాను ఆపార్టీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది జరిగిన వెంటనే మరో ఆప్ నేత మీద అతని భార్య గృహహింస చట్టం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో నేత విశ్వాస్, అయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలోని ఒక వ్యక్తిని విశ్వాస్ అతని భార్య బెదిరించారని ఫిర్యాదు అందడంతో వారిపై కేసు నమోదయింది. ఈ ఆరోపణపై విశ్వాస్ స్పందించి తాను కానీ తన భార్య కానీ ఎవరిని బెదిరించలేదని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు.






