రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లు మనిపించిన ఈటెల
Published on: Tue Jan 21, 2025 12:39PM
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బిజెపి ఎం పీ ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారు. మేడ్చెల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ లో ఎంపీ పర్యటిస్తున్న సమయంలో స్థానికులు ఈటెలకు ఫిర్యాదులు చేశారు. తమ భూములు కబ్దా అయినట్టు చెప్పారు. స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తమకు ఆక్రమణలో ఉన్న భూములు విక్రయించినట్టు చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడంతో చాలామంది మోసపోయినట్టు గుర్తించిన ఈటెల బ్రోకర్ ఇంటికి వెళ్లి మరీ చెంపచెల్లు మనిపించారు. ఈటెల ఈ రకంగా స్పందిస్తారని అక్కడున్నవారు ఊహించలేకపోయారు.


