Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం
posted on: Mar 11, 2026 3:13PM
.webp)
హైదరాబాద్ నుంచి థాయ్లాండ్కు వెళ్లిన ఒక ప్రయాణికుల విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన బోయింగ్ 737 విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరి థాయ్లాండ్లోని ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆందోళ నకర పరిస్థితి నెలకొంది.హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్కు బయలుదేరిన ఈ విమానం ఈరోజు బుధవారం ఫుకెట్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ముందు భాగంలోని నోస్ వీల్ (ఫ్రంట్ ల్యాండింగ్ గేర్) ఊడిపోయింది.
దీంతో విమానం రన్వేపై స్థిరంగా నిలవలేక కొంతదూరం పక్కకు జారింది. అదే సమయంలో వెనుక భాగంలోని ఒక టైర్ కూడా పేలిపో యినట్లు అధికారులు తెలిపారు. అయితే పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని అదుపులోకి తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం వేగం తక్కువగా ఉండటం కూడా ప్రయాణికులకు పెద్ద ప్రమాదం జరగకుండా సహాయపడింది. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 133 మంది ప్రయా ణికులు ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు.
అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టి ప్రయాణి కులను సురక్షితంగా విమానం నుంచి కిందకు దింపారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడారని ప్రయాణికులు, అధికారులు పైలట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఘటనపై సాంకేతిక నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం తలెత్తిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొంతసేపు ఫుకేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.






