మాంస ప్రియులకు బంపర్ ఆఫర్... యానాంలో చౌకగా చీరమే చేపలు
posted on: Oct 28, 2024 4:35PM
సరిగ్గా దీపావళికి ముందు సముద్ర జలాల్లో కనిపించే చీరమే చేప యానాం మార్కెట్లో అందుబాటులో వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఈ చీరమే చేప అత్యధికంగా అందుబాటులో వచ్చింది. సప్లయ్ ఎక్కువైతే డిమాండ్ తగక్కువవుతుంది. గతంలో 30 నుంచి 40 వేల రూపాయలకుకు బకెట్ చీరమే దొరికేది. ప్రస్తుతం పదివేల రూపాయలకు బకెట్ దొరకడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయంగా చీరలతో ఈ చేపలను మత్స్యకారులు పట్టుకుంటారు. కాబట్టి దీనికాపేరు వచ్చింది. చేప జాతులలో అతి చిన్నది ఈ చేప. దీని జీవిత కాలం కూడా తక్కువే. సంవత్సరానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ చేప అందుబాటులోకి రావడంతో కస్టమర్లు బాగానే వస్తున్నప్పటికీ చీరమే చేపల ధరలు పడిపోవడం మత్స్య కారులు నిరుత్సాహానికి గురయ్యారు . కార్తిక మాసం కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చీరమే చేప అమ్మకాలు పెరగవచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పాత చీరలతో పట్టే చీరమే ప్రస్తుతం ఆధునిక యంత్రాల ద్వారా పట్టుకుంటున్నారు . గోదావరి పాయలు కలిసే భైరవపాలెంలో ఈ చేపలు అత్యధికంగా దొరుకుతాయి.ఈ చీరమే చేప శేర్ రెండు వేలకు విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు.






