Top Stories

తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య విచారం.. రూ.10 లక్షల పరిహారం

  బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.చిన్నస్వామి స్టేడియం 30వేలు మాత్రమే కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామని ఆయన వివరించారు."ప్రజల స్పందన మా అంచనాలను మించిపోయింది.  విధానసౌధ ముందు లక్షకు పైగా జనం గుమిగూడినా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ  స్టేడియం వద్ద ఈ విషాదం సంభవించింది. క్రికెట్ అసోసియేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఇంతటి పరిణామం ఊహించలేదాని ఆయన తెలిపారు. చిన్న‌స్వామి స్టేడియం తొక్కిస‌లాట‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయుల‌ను కోల్పోయిన కుంటుంబలకు కేంద్ర త‌ర‌ఫున‌ రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు రూ. 50 వేల ప‌రిహారం చెల్లిస్తామ‌ని మోడీ వెల్ల‌డించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు
తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య విచారం.. రూ.10 లక్షల పరిహారం Publish Date: Jun 4, 2025 9:32PM

రోడ్డుపై వైసీపీ క్యాడర్.. బెంగళూరులో లీడర్

  జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజాసమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారా అంటే అదీ లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెల్లబుచ్చడం విమర్శల పాలవుతోంది. ఆఖరికి పార్టీపరంగా  పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తులు వక్తమవున్నాయి.జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తైంది . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్‌ పిలుపు ఇచ్చారు. అంతలావున  పిలుపు ఇచ్చిన మాజీ  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదంట.వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది.  అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి, తర్వాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్..తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా?.. అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నాయి. వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోయిన జగన్ నెక్ట్స్ షెడ్యూల్‌ని ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్  ఈ నెల11 లేదా 12న నెల్లూరు జైలుకు వస్తారని చెప్పుకొచ్చారు.  పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్.. జైళ్లలో పరామర్శలు, ఓదార్పులకు మాత్రమే జనంలోకి వస్తుండటంపై సోషల్ మీడియాలో కూడా తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి.
రోడ్డుపై వైసీపీ క్యాడర్.. బెంగళూరులో  లీడర్ Publish Date: Jun 4, 2025 9:08PM

కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా..చంద్రబాబుకు మంత్రులు అభినందనలు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్‌లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్‌మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని  కేబినెట్  నిర్ణయించింది .2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది.  సత్ప్రవర్తన కల్గినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది.వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది.ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది.  ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్‌లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబ కు మంత్రులు అభినందలు తెలిపారు.  కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని .. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి  ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు. 
కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా..చంద్రబాబుకు మంత్రులు అభినందనలు Publish Date: Jun 4, 2025 7:51PM

తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి

  బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీకే క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ ఫ్యాన్స్ బారీగా తరలిరావడంతో అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు.మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిలందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. భద్రత కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. అయితే, అక్కడ ఉన్నది ఉత్సాహంతో ఉన్న యువత. వారిపై లాఠీఛార్జ్ చేయలేము కదా" అని డీకే శివకుమార్ అన్నారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తొక్కిసలాటలో 11 మంది వరకు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.సడన్‌గా 19వ గేటు ఓపెన్ చేయటంతో  తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విక్టరీ పరేడ్ కోసం లక్షలాది మంది వచ్చారని అందుకని 10 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ముగించామని- డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  
తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి Publish Date: Jun 4, 2025 7:19PM

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..11 మంది మృతి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల  తర్వాత ఛాంపియన్స్ నిలవటంతో   ఫ్యాన్స్  భారీగా  స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది.  క్షతగాత్రులను శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆర్సీబీ టీమ్‌కు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.క్షతగాత్రులను స్థానిక బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరామర్శించేందుకు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య విధాన సౌధ నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేకపోయామని వారు తెలిపారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..11 మంది మృతి Publish Date: Jun 4, 2025 6:21PM

ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి

  ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్  తెలిపారు. చంద్రగిరి కోట నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమము లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,  తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గోన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు పాటు అంత రాష్ట్రవ్యాప్తంగ, జిల్లా మండల, గ్రామ స్థాయి వరకు  యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు.  ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగ ఉండాలని ఉద్దేశంతో  ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. సచివాలయం పరిధి,వార్డు పరిధి లో అందరికీ  యోగా గురించి శిక్షణ, అవగాహన  కల్పిపిస్తున్నామని అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ జరిగింది అని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మిగతా అధికారుల తో కలిసి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని యోగ చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.  
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి Publish Date: Jun 4, 2025 5:35PM

కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు

  వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి  కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.  రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాని సీఎం రేవంత్ హామీ అయిందని హరీష్ రావు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్  భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్  ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు Publish Date: Jun 4, 2025 5:04PM

బెంగుళూరులో అడుగుపెట్టిన ఛాంపియన్స్..ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన స్వాగతం

  ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండటంతో పరేడ్‌ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఓపెన్‌ బస్‌ పరేడ్ రద్దయింది. అయితే, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విజేతగా  నిలిచిన విషయం తెలిసిందే.నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జట్టు బెంగళూరు నగరానికి చేరుకుంది.
బెంగుళూరులో అడుగుపెట్టిన ఛాంపియన్స్..ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన స్వాగతం Publish Date: Jun 4, 2025 4:15PM

జగన్ కు బదులు సజ్జల జైలు యాత్రలు.. సంకేతమేంటి?!

వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన జైలు ములాఖత్ లు జగన్ అరెస్టైతే పార్టీ పగ్గాలు చేపట్టేది తానేనని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని వైసీపీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది.  తొలి నుంచీ కూడా ఒక వేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపడతారన్న భావన పార్టీ వర్గాల్లో కనిపించేది. అయితే భారతి పెద్దగా జనంలోకి రాకపోవడం, వైసీపీ నేతల అరెస్టులపై ఆమె ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని అవగతమౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే సజ్జల ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో ఒకింత చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలకు సంబంధించిన బాధ్యతలు సజ్జలే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో తరచుగా ఆయన జైలు ములాఖత్ లు జరుపుతున్నారు. గతంలో ఈ పని జగన్ చేసేవారు. అయితే కారణాలేమైతేనేం.. జగన్ జైలు పరామర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన స్థానంలో ఆ పని సజ్జల చేస్తున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జైల్లో సజ్జల కలిసి పరామర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ అరాచకాలు, దౌర్జన్యాలూ ఓ రేంజ్ లో ఉండేవి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్న వారిలో అత్యధికులు నందిగం అనుచరవర్గమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నందిగం సురేష్ పై పలు కేసులు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నందిగం సురేష్ పై ఉన్న కేసుల బూజు దులిపింది. దీంతో ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిలు వచ్చింది. కానీ మరో  కేసులో ఆయన ఇటీవల మళ్లీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో   గుంటూరు జైల్లో ఉన్న  నందిగం సురేష్ తో సజ్జల సోమవారం (జూన్ 2)న. సజ్జల ములాఖత్ అయ్యారు.  నందిగం సురేష్ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల ఆయనకు ధైర్యం చెప్పారు,  దీంతో ఇప్పుడు సజ్జల జైల్లో ములాఖత్ లకు సంకేతమేంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. గతంలో చలా మంది వైసీపీయులు అరెస్టైనా జైలుకెళ్లి వారితో ములాఖత్ కాని సజ్జల ఇటీవలి కాలంలో వరుసగా జైలు పర్యటనలు చేయడం వెనుక గట్టి వ్యూహమే ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు,   నందిగం కంటే ముందు సజ్జల విజయవాడ సబ్ జైలులో  మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న   సీఎంఓ మాజీ   కార్యదర్శి   ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ  కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు.  ఆ తరువాత   నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ కలిశారు. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్ తో గుంటూరు జైలులో ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వేళ జగన్ జైలుకు వెడితే ఆయన ఆబ్సెన్స్ లో సజ్జలే పార్టీని నడిపిస్తారన్న సంకేతాలను ఆయన తన ములాఖత్ భేటీల ద్వారా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
జగన్ కు బదులు సజ్జల జైలు యాత్రలు.. సంకేతమేంటి?! Publish Date: Jun 4, 2025 3:53PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో  పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణలో అమెరికా జోక్యం తదితర అంశలపై కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నించనున్నాయి.'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.    
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు Publish Date: Jun 4, 2025 3:36PM

వైసీపీ నిరసనలు వెలవెల.. కూటమి సంబరాలు కళకళ

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది. అవును జగన్ పార్టీ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలవెలబోయాయి. అదే సమయంలో కూటమి పార్టీల ఏడాది పాలన సంబరాలు కళకళలాడాయి. కూటమి సంబరాలలో వైసీపీ నిరసనలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.    జూన్ 4 ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు స్ఫూర్తిదాయకంగా ఉంది.  ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా ఆయన ఆ పోస్టులో జూన్ 4ను అభివర్ణించారు.  అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన చారిత్రాత్మకమైన రోజన్నారు.  సైకో పాలనకు ప్రజా చైతన్యం అంతం పలికిన రోజనా, రాష్ట్రంలో  ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజంటూ చంద్రబాబు పేర్కోన్నారు. సమస్యల పరిష్కారం కోసం జనం ఉద్యమించడం చూశాం.. అయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, రాక్షస పాలనను అంతం చేయడం కోసం ఓటు వేయడానికి ఉద్యమంగా కదిలిన జనాలను చూడటం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.   ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కు సరిగ్గా ఏడాది కిందట ఈ రోజు జనం నాంది పలికారన్నారు.   ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ప్రజా తీర్పునకు ఏడాది అంటూ ఆరంభించి ప్రజా చైతన్యానికి కూడా ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఏడాది అని, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది అని ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన  విజయానికి  డాది అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచకపాలనను తరిమికొట్టి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన ప్రజల పరిణితి చరిత్రలో నిలిచిపోయిన రోజని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.   అటు కేంద్రం లోని నరేంంద్ర మోదీ సర్కారు విజయాలను గుర్తు చేస్తూనే…మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
వైసీపీ నిరసనలు వెలవెల.. కూటమి సంబరాలు కళకళ Publish Date: Jun 4, 2025 3:17PM

కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లే : కవిత

  రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్  కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులు ఇస్తే, యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే" అని ఆమె అన్నారు.. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు. "ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది జవాబుదారీతనం కోసం కాదు. కేవలం రాజకీయంగా పరువు తీయడం కోసమే అని ఆమె అన్నారు.ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలని ఆమె అన్నారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే  తెలంగాణ ప్రజలకు  ఇచ్చినట్లే :  కవిత Publish Date: Jun 4, 2025 3:16PM

స్వాట్ తో తెలంగాణ సర్కార్ కు ప్రశంసలు

స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్‌గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.  హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు. సాధారణంగా పురుష పోలీసులు మహిళా నిరనసకారులను నియంత్రించే విషయంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతున్నాయ్. అందువల్ల.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త టీమ్‌ని రెడీ చేస్తున్నారు. ఈ కొత్త ఫోర్స్‌లోని మహిళా పోలీసులకు.. సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. నిరనసలు, ఆందోళనల సమయంలో.. వారికేదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరికి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా.. క్లిష్ట పరిస్థితుల్లో గుంపులను నియంత్రించడంలో సహాయపడతారు. నిరసనలు, ఆందోళనల సమయంలో.. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంలో.. వారిని తరలించడంలో చట్టబద్ధమైన, సున్నితమైన విధానాలను అనుసరించడమే ఈ టీమ్ లక్ష్యం.  ధర్నా సమయాల్లో మహిళలకు, మహిళా వీఐపీలకు రక్షణ ఇచ్చే విషయంలో.. ఈ మహిళా పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందారు.  ట్రైనింగ్‌లో వాళ్లు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ని కూడా ప్రదర్శించారు.  మొదటి దశలో 35 మంది మహిళా పోలీసులతో.. ఈ యాక్షన్ టీమ్‌ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సీపీ సీవీ ఆనంద్. దీనిని  భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఆందోళనల సమయంలో మహిళలను ప్రొటెక్ట్ చేయడం, వారిని సేఫ్‌గా తరలించడం కోసం ఈ టీమ్ పనిచేస్తుంది. మొత్తంగా రెండు ప్లాటూన్ టీమ్‌లను సిద్ధం చేస్తామని.. సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ లాంటి మహిళా భద్రత కార్యక్రమాలకు మరింత మద్దతుగా నిలవనుంది. ఇది.. మహిళల భద్రత పట్ల హైదరాబాద్ పోలీసులకు ఉన్న కమిట్‌మెంట్‌ని తెలియజేస్తోంది. ఈ కొత్త విమెన్ ఫోర్స్.. మహిళల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు.. ఇచ్చే ప్రాధాన్యత అందర్నీ ఆకట్టుకుంటుంది.
స్వాట్ తో తెలంగాణ సర్కార్ కు ప్రశంసలు Publish Date: Jun 4, 2025 2:58PM

పోలీసులపై రెచ్చిపోయిన అంబటి.. లోపలికి వెళ్తే ఏం చేస్తావ్

  గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర  వాగ్వాదన్నికి దిగారు. వైసీపీ నేతలు మూకుమ్మడిగా కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని సీఐ చెప్పడంతో అంబటి పోలీసులపై ఉగ్రరూపం చూపించారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావో చేసుకో అని పోలీసులపై మండిపడ్డారు. అపుకోండి అని సీఐకి వేలు చూపిస్తూ హెచ్చారించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే, ఓ పోలీస్ అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
పోలీసులపై రెచ్చిపోయిన అంబటి.. లోపలికి వెళ్తే ఏం చేస్తావ్ Publish Date: Jun 4, 2025 2:37PM

నెంబర్ 18‌తో క్రికెట్ కింగ్ కోహ్లీ అనుబంధం

క్రి‌కెట్లో రికార్డుల కింగ్‌ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్‌కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్  కప్‌ను ముద్దాడింది. కోహ్లీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు జెర్సీ నెంబరు 18 కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్  అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కోహ్లీ ఆ జెర్సీ నెంబరుతోనే కనిపిస్తాడు. వాస్తవానికి అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడే కోహ్లీకి ఆ నెంబరుతో జెర్సీ ఇచ్చారు. ఆ తర్వత  అది తన జీవితంతో ప్రత్యేకంగా మారిందని, రెండు ముఖ్యమైన క్షణాలు ఆ రోజునే జరిగాయని గతంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది 18వ తేదీనే. 18 ఆగస్టు 2008లో తొలి వన్డే ఆడాడు. అతడి తండ్రి ప్రేమ్‌ కోహ్లీ 2006 డిసెంబరు 18న గుండెపోటుతో మరణించారు. కోహ్లీ తండ్రి కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారంట. ఆయన గుర్తుగా కింగ్ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు.  ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కల నెరవేరింది. 18వ సీజన్లో కప్పు దక్కించుకోవడంతో ఆ నెంబరు కోహ్లీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలిచిన రోజు కూడా  ఆ నెంబర్ మ్యాజిక్ కొనసాగడం విశేషం. 3-6-2025 కప్ గెలిచిన రోజు. అది టోటల్ చేస్తే వచ్చేది కూడా 18 కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
నెంబర్ 18‌తో క్రికెట్ కింగ్ కోహ్లీ అనుబంధం Publish Date: Jun 4, 2025 1:09PM

పీఎస్సార్ అంజనేయులుకి మళ్లీ అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పీఎస్సార్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలిస్తారు. ఇదే సమస్యతో ఆంజనేయులును గత నెల 31న ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన అధికారులు చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు.   పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగున్న సంగతి తెలిసిందే.  
పీఎస్సార్ అంజనేయులుకి మళ్లీ అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి Publish Date: Jun 4, 2025 12:57PM

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు సిట్ నోటీసులు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో  ఏర్పాటైన ప్రత్యేక  దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి పిఏ గా  పని చేసిన అప్పన్నకు అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం (జూన్ 4( నుంచి మూడు రోజులు పాటు తిరుపతి లోని సిట్ కార్యాలయంలోఅప్పన్నను సీట్ అధికారులు విచారిస్తారు. త్వరలో మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, మాజీ ఈవో  ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీటీడీ మాజీ జేఈవో   సహ ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..  ఈ కేసుకు సంబంధించి  మరికొందరిని  అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు  దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది.  ఉత్తరాఖండ్   రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు.  అక్కడ ఏఆర్ డైరీ సీల్   వేసి టీటీడీకి సరఫరా చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.   అసలు తొలుత శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ప్రకటించారు. ఒక సభలో ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఆరోపించారు.    చంద్రబాబు ఆరోపణ అప్పట్లో  పెను సంచలనం   సృష్టించింది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే  ఈ కేసులో సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమౌతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించి..   సీబీఐ ఆధ్వర్యంలో  సుప్రీం కోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది.    
లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు సిట్ నోటీసులు Publish Date: Jun 4, 2025 12:35PM

జగన్ రాక్షస పాలనపై సమర శంఖం యువగళం!

జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం (జూన్ 4) రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. పాదయాత్ర నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.  జగన్ అరాచకపాలనకు జనం చరమగీతం పాడి ఏడాది పూర్తయ్యిందనీ, అయినా జగన్ పాలన పీడకలను జనం ఇప్పటికీ మరచిపోలేదని పవన్ కల్యాణ్ అన్నారు.  ఈ సందర్భంగా తన యువగళం పాదయాత్ర అనుభవాలను లోకేష్ పవన్ కల్యాణ్ తో పంచుకున్నారు. 
జగన్ రాక్షస పాలనపై సమర శంఖం  యువగళం! Publish Date: Jun 4, 2025 12:11PM

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా  చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఒక్క సారిగా స్ఫృహతప్పి కుప్పకూలిపోయారు. వెన్నుపోటు దినంలో భాగంగా వేదికపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు బొత్సను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వడదెబ్బకు గురి కావడం వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తోంది. 
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత Publish Date: Jun 4, 2025 11:57AM

నమ్మితే నమ్మండి.. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరార్!

నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా  లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. నిజానికి మాములు జనమే కాదు.. రాజకీయ వర్గాల్లో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ జరిగితే చూద్దాంలే అన్న మాటే వినిపిస్తోంది. అవును మరి, ఒకటి  రెండు సార్లు వాయిదా అంటే ఓకే..  కానీ ఒకటికి పది సార్లు అదే  రిపీట్ అయితే..  సహజంగానే నాన్న పులి కథ గుర్తుకొస్తుంది. అయినప్పుడు చూద్దాంలే అనే అనుకుంటారు.  అయితే..  ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ  పక్కా అనే మాట  ఢిల్లీ వర్గాల నుంచి కొంచెం గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. నిజానికి.. ఇప్పటికే  అంతా అయిపోయిందనీ..  కేవలం లాంఛనంగా ప్రకటన  విడుదల చేయడం మాత్రమే మిగిలుందని అంటున్నారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మరి కొందరు ముఖ్యనాయకులు జూన్ 4 న ఢిల్లీ వెళుతున్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్  గాంధీతో, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ కీలక భేటీలో  ఖాయంగా  మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులతో పాటుగా..  విస్తరణ  ముహూర్తం కూడా ఫైనల్ అవుతుందని, అలాగే  టీపీసీసీ  కూర్పు కూడా  ఖరారు కావడం ఖాయమనీ  విశ్వసనీయ వర్గాల  సమాచారంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  అయితే..  ఉహాగానాలు నిజ్జంగా నిజం అవుతాయా లేక, ఎప్పటిలానేనా?  అనే అనుమానాన్ని  పక్కన పెడితే..  తాజా సమాచరం ప్రకారం ఆశావహుల జాబితాలో ఈ సారి, నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిన  రాములమ్మ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం పేరు వినిపించడం మాత్రమే కాదు..  ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటున్నారు.    నిజానికి..  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్’లో  జయశాంతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసినప్పుడే ఆశావహుల జాబితాలో ఆమె పేరు చేరింది. మీనాక్షి నటరాజన్ ను కలిసిన సందర్భంలో విజయశాంతి తన మనసులోని కోరికను బయట పెట్టినట్లు తెలిసింది. ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ అది అధిష్టానం పరిధిలోని అంశం అంటూనే.. విషయాన్ని అధిష్టానం చెవిన వేస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ..  ఇప్పుడు  ఫైనల్ లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.  అదలా ఉంటే..  మంత్రి వర్గంలోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవడంతో పాటుగా, మంత్రుల శాఖల్లో కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతల శాఖల్లోనే మర్పులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇద్దరు మంత్రుకు ఉద్వాసన తధ్యమనే  చర్చ కూడా జరుగుతోంది. అలాగే..  కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ..  అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే చివరాఖరుకు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ సస్పెన్సే.. అంటున్నారు.
నమ్మితే నమ్మండి.. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరార్! Publish Date: Jun 4, 2025 11:12AM

‘టీ ’ కప్పులో కొత్త ట్విస్ట్.. తెరపైకి ట్రబుల్ షూటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం  స్పందించారు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా చిన్నా పెద్దా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించిన హరీష్ రావు..  కవిత ఎపిసోడ్ లో మాత్రం మొదటి నుంచి మౌనంగానే ఉన్నారు. నిజానికి.. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు, కేసీఆర్ మొదలు సంతోష్ వరకు, బీఆర్ఎస్ డ్రామాలోని ముఖ్య పాత్ర దారులు అంతా సైలెంట్ గానే ఉన్నారు.  ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న కవిత ఎపిసోడ్ లో కీలక పాత్ర దారులు ఎవరూ కూడా పెదవి విప్పలేదు.  కేసీఆర్ దేవుడు .. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ పరోక్షంగానే అయినా  ఆమె కుటుంబ సభ్యులపై వేలెత్తి చూపినా.. అంతకు మించిన వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు చేసినా..  అంతా గప్ చిప్. ఎవరూ పెదవి విప్పలేదు. అంతే కాదు.. కుటుంబ పెద్దలు మాట్లాడక  పోవడమే కాదు.. ఎవరూ మాట్లాడరాదని పెద్దాయన హుకుం జారీ చేశారనీ అందుకే  ఎవరూ పెదవి విప్పడం లేదని అంటున్నారు.  అయితే.. ఇంతకాలంగా మౌనంగా ఉన్న హరీష్ రావు.. తెలంగాణ జెండా సాక్షిగా  పెదవి విప్పారు. తెలంగాణ భవన్‌లో  జూన్2న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న హరీష్‌రావు.. కవిత చేసిన కీలక వ్యాఖ్య పై స్పందించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు, కొందరు  కుట్ర చేస్తున్నారంటూ  కవిత  ఎవరి పేరూ ప్రస్తావించకుండా చేసిన విమర్శకు హరీష్ రావు  సమాధానం ఇచ్చారు.  అయితే ఇక్కడ హరీష్ రావు కూడా  కవిత పేరు ప్రస్తావించలేదు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందనీ..  బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని   కొందరు   అంటు న్నారు కానీ అందులో నిజం లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు.. విలీనం మాట దేవుడెరుగు, బీజేపీతోనే కాదు, ఇంకెవరితోనూ పొత్తు వరకు కూడా ఉందనీ..   కారు  ఒంటరిగానే రేసులో దిగుతుందని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్వయంగా కేసీఆర్  చెప్పారని గుర్తుచేశారు. అలాగే..  కేసీఆర్’ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే..  మరోవంక కవిత.. అంతకంటే ఎక్కుగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వరకూ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో బీఆర్ఎస్  విలీనం ఎపిసోడ్ ను సజీవంగా ఉంచేందుకు  శత విధాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ చేసిన ప్రచారం  హస్తం పార్టీకి బాగా కలిసోచ్చింది. హస్త రేఖలను మార్చివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మరలేందుకు కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగించిన ప్రచారం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది.  అఫ్కోర్స్..  అదే సమయంలో బీజేపీ  బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి  తప్పులో కాలేసింది. కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్  ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఆ విధంగా బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకీ సోకింది. అంతవరకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దూకుడు చూపిన బీజేపీ ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది.  సో .. ఇప్పడు, మళ్ళీ రేపటి స్థానిక సంస్థల  ఎన్నికల్లో  అదే కార్డు ప్లే చేసేందుకు  ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ..  కవిత చేసిన  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని గట్టిగా పట్టుకుంది. స్థానిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి..  కవిత విలీనం అంశాన్ని తెరపైకి తీసుకు రావడం వెనక  కాంగ్రెస్ హస్తం ఉండ అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని, కేటీఆర్ అన్నది ఇందుకేనా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు ఎలా ఉన్నా.. కవిత ఎపిసోడ్ లో వెలుగులోకి వచ్చిన రాజకీయ చీకటి కోణాలు ప్రధాన పార్టీల పాతివ్ర త్యానికి పరీక్షగా నిలిచాయని అంటున్నారు. ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటన్నది పక్కన పెడితే..  రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు ఇదే మాదిరిగా అయితే ఉండవనీ,  కవిత ఎపిసోడ్ కు అటూ ఇటు అన్నట్లుగా మారిపోతాయని రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
 ‘టీ ’   కప్పులో కొత్త ట్విస్ట్.. తెరపైకి ట్రబుల్ షూటర్ Publish Date: Jun 4, 2025 10:55AM

తుని కేసు విచారణపై జీవో.. కుట్ర కోణంపై అనుమానాలు

తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు. ఈ సభ కాస్తా ఆందోళనలకు తెరలేపింది. ఆ ఆందోళనలు   అదుపు తప్పి..  ప్రయాణీకులతో వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులపెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అలాంటి కేసు ఇప్పుడు మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే అలాంటిది ఏం లేదని.. జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది? మళ్లీ వెంటనే వెనకడుగు ఎందుకు వేసింది? అనేదే ఇప్పుడు చర్చ. తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా.. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో.. రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కేసులను ఎత్తివేసింది. 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టివేసింది.  ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్‌విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలంటూ జీవో జారీ అయ్యింది. ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ముఖ్యులైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకర్‌రావులాంటి వారికి మళ్లీ చిక్కులు తప్పవని తేలిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది . తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  అసలు జీవో ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరి పర్మిషన్‌తో జీవో బయటికి వచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే తుని కేసును తట్టి లేపడమంటే.. ఏపీలో మరో తేనే తుట్టెను కదిపినట్టే. మొత్తం కాపు  సామాజికవర్గాన్ని కదిలించినట్టే. అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడిందనేది మాత్రం తెలుస్తోంది. అందుకే జీవో విడుదలై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. క్లారిటీ ఇస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు.  ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది.. ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అసలు సీఎంవో పెద్దల జోక్యం లేకుండా.. సీఎస్ పరిశీలించకుండా.. సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటికి వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనక మరేదైనా కుట్ర ఉందా? లేక అధికారుల తప్పిదమేనా? అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
 తుని కేసు విచారణపై జీవో.. కుట్ర కోణంపై అనుమానాలు Publish Date: Jun 4, 2025 10:06AM

యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు,  జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21న ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.  యోగాడైపై మంగళవారం (జూన్ 3) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.   7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు, 14 వతేదీ రాష్ట్రంలో లక్ష  ప్రాంతాల్లో యోగా సాధన ఉంటుందన్నారు.  చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం  చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో  మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మాసంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.  
యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం Publish Date: Jun 4, 2025 9:51AM

మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమానిపై కేసు

నకిలీ పత్రాలతో ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకున్న మద్రాస్ ఫిల్టర్ కాఫీ యమజానిపై కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సృష్టించి.. 1979 నుండి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను, కోర్టు లను బురిడీ కొట్టించి ప్రజలను మోసం చేస్తున్న మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ పై కేసు నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా  పోడూరు పోలీసు స్టేషన్ లో యశ్వంత్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బృందాలుగా ఏర్పడి విచారణ సాగించారు. యశ్వంత్ కుమార్ చీటింగ్ కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   కాగా నిందితుడు పరుచూరి యశ్వంత్ కుమార్ పై గతంలో కూడా   రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు  ఉన్నాయి.  విజయవాడ సింగ్ నగర్ పోలిస్ స్టేషన్ లో డబ్బులు కోసం బెదిరింపు, చీటింగ్ కేస్  కింద  కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియాలో) తోటి వ్యాపారులను బెదిరించిన నేరంపై విశాఖ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.   వాస్తవానికి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ అసలు వ్యవస్థాపకులు వేరే ఉండగా కుట్రతో, అనైతికంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 1979 నుండే ఈ బ్రాండ్ తన స్వంతమని చెప్పుకుంటూ ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గడించి సాటి వ్యాపారస్తులను ముంచేశాడు. తాజాగా ఈ ఫోర్జరీ భాగోతం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున   బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి.  
మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమానిపై కేసు Publish Date: Jun 4, 2025 9:35AM

పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..!

పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.
పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..! Publish Date: Jun 4, 2025 9:30AM

మూత్ర పిండాలలో రాళ్లను నివారించే మూలికలు, చిట్కాలు..!

ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మూత్ర పిండాలలో రాళ్లను నివారించే మూలికలు, చిట్కాలు..! Publish Date: Jun 4, 2025 9:30AM

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా

ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆర్సీబీ ఆ అద్భుతం చేయడంలో కృనాల్ పాండ్యా బౌలింగ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పంజాబ్ కింగ్స్ ను నియంత్రించడమే కాకుండా రెండు కీలకమైన వికెట్లను కూడా పడగొట్టిన కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచాడు. కృనాల్ పాండ్యా తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రభ్ సిమ్రాన్, జోష్ ఇంగ్లీష్ లను ఔట్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మొత్తంగా ఐపీఎల్ 2025 సీజన్ లో కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆడిన 15 మ్యాచ్ ల్లో కృనాల్ పాండ్యా మొత్తం 17 వికెట్లు తీసుకున్నారు. 
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా Publish Date: Jun 4, 2025 2:50AM

కింగ్ సాధించాడు.. ఆర్సీబీని మురిపించాడు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కోసం చెమటోడ్చాడు. రక్తం ధారపోశాడు. ఇన్నేళ్లుగా ఒకే ఫ్రాంఛైజ్ కు కట్టుబడి ఆడిన ఏకైక ఆడగాడు విరాట్ కోహ్లీయే.  విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రస్థానంలో అండర్ 19 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే.. వన్డే, టి20 వరల్డ్ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీలలో విజేత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి ప్రతిభ, ప్రావీణ్యం ఉన్న ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా లెంజడరీ క్రికెటర్లందరి ప్రశంసలూ అందుకున్నాడు. రెండు, మూడు మినహా  సచిన్ రికార్డులన్నిటినీ తిరగరాసి రన్ మెషీన్ గా, పరుగుల దాహం తీరని బ్యాటర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని కింగ్ కోహ్లీ అయ్యాడు. అటువంటి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఇంత కాలం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. వరుసగా 17 ఏళ్ల పాటు ట్రోఫీ గెలవలేకపోయిన జట్టుకు మరే జట్టుకూ లేనంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీయే అనడంలో సందేహం లేదు. తన ఆశలనే కాదు.. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోపీ దక్కించుకుని తీరాలన్న కోట్లాది మంది అభిమానుల ఆశలను కూడా విరాట్ కోహ్లీయే ఇంత కాలం ఒంటి చేత్తో మోస్తూ సాగాడు. ఇప్పుడు తన కల నెరవేర్చుకోవడమే కాదు.. అభిమానుల ఆశ కూడా తీర్చి గోప్ప రీలీఫ్ పొందాడు.  విజయానంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టు సహచరులతో కలిసి మైదానమంతా కలియతిరిగాడు. ఉత్సాహం పట్టలేక ఉరకలేశాడు. ఆ ఆనందం అందరికీ 2008 నాటి యువ కోహ్లీని తలపించింది. తన భార్య అనుష్కశర్మను హత్తుకుని విజయానందాన్ని పంచుకున్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ఆర్సీబీ మాజీ సహచరులతో ఆనంద క్షణాలను పంచుకున్నాడు. 
కింగ్ సాధించాడు.. ఆర్సీబీని మురిపించాడు! Publish Date: Jun 4, 2025 2:32AM

ఆనందంతో కరిగి కన్నీరైన క్రికెట్ కింగ్

ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు. మైదానంలో మోకాళ్ల మీద కూలబడి కన్నీరుమున్నీరయ్యారు. ఆ తరువాత జట్టు సహచరులతో, ఆర్సీబీ మాజీ ప్లేయర్లు ఏబీడివిలియర్స్, క్రిస్ గేల్ లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భార్య అనుష్కశర్మను హత్తుకుని మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఐపీఎల్ ఆరంభం నుంచీ ఇప్పటి వరకూ జరిగిన 18 సీజన్లలోనూ ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ ఒక్కడే.  విజయం అనంతరం మాట్లాడిన కోహ్లీ ఈ విజయం తనకు, జట్టుకు, ఆర్సీబీ ఫ్యాన్ బేస్ కూ ఎంతో ముఖ్యమైనది, విలువైనది అని చెప్పాడు. ఈ 18 ఏళ్లుగా ప్రతి ఐపీఎల్ సీజన్ లోనూ తాను విజయం కోసమే ఆడానని చెప్పిన కోహ్లీ.. ఆర్సీబీ కోసం తాను సర్వశక్తులూ ఒడ్డాననీ, ఈ విజయం తనకు ఒక అద్భుత అనుభూతి అనీ వివరించాడు.  ఏ విధంగా చూసినా ఐపీఎల్ చరిత్రలో 2005 సీజన్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఈ 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో ఇంతటి భావోద్వేగమైన ముగింపు ఇదే ప్రథమం.  పలుసార్లు ట్రోఫీ గెలిచిన జట్లకు కూడా లేనంత బలమైన ఫ్యాన్ బేఃస్ ను సొంతం చేసుకున్న జట్టు ఆర్సీబీ. గత 18 ఏళ్లలో మూడు సార్లు ఫైనల్స్ వరకూ వచ్చి, మరెన్నో సార్లు లీగ్ దశ దాటి నాకౌట్ దశకు వచ్చినప్పటికీ కప్ అందుకోవాలన్న కలకలాగే మిగిలిన జట్టు.  ఎట్టకేలకు నాలుగో సారి ఫైనల్ ఆడుతూ కప్పును ముద్దాడింది. అయితే ఇది కేవలం టైటిల్ విజయం కాదు.. 17 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. ఎన్నో అవమానాలకు, ట్రోలింగ్ లకు చెప్పిన సమాధానం. వీటన్నిటి వెనుకా ఉన్నది ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ. అందుకే ఈ విజయాన్ని, కప్ ను విరాట్ కోహ్లీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు జట్టు కెప్టెన్ పటీదార్
ఆనందంతో కరిగి కన్నీరైన క్రికెట్ కింగ్ Publish Date: Jun 4, 2025 2:00AM