TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో 55 మంది అరెస్ట్  

Published on: Tue Nov 12, 2024 2:57PM

 వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  .  గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఏకంగా కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బిఆర్ ఎస్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీకి భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించి గ్రామస్థుల చేత అభిప్రాయ సేకరణ చేపడుతుండగా దాడి జరిగింది.