శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Thu May 25, 2023 9:46AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని మొత్తం 74వేల 995 మంది భక్తులు దర్శించుకున్నారు.
38వేల 663 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.


