Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జ్ షీట్
posted on: Jul 19, 2025 9:26PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం (జులై 18)న ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్.. ఆ చార్జిషీట్ లో కీలక విషయాలను పేర్కొంది. దాదాపు 300 పేజీల ఈ చార్జ్ షీట్ లో వందకు పైగా ఫోరెన్సిక్ నివేదికలను పొందుపరిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకూ . 62 కోట్ల రూపాయలను సీజ్ చేసిట్లు పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి 268మంది సాక్ష్యులను విచారించి, అరెస్టు చేసిన 11 మంది నిందితుల స్టేట్ మెట్లను కూడా ఆ చార్జ్ షేట్ లో పేర్కొంది.
బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మద్యం అక్రమ సొమ్మును పెట్టుబడులుగా పెట్టినట్లు సిట్ పేర్కొంది. అలాగే షెల్ క ంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సిట్ పేర్కొంది. అలాగే మద్యం అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలు, బంగారం దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలను, నిందితులు, సాక్ష్యుల స్టేట్ మెంట్లనూ కూడా సిట్ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది. కాగా సిట్ శనివారం (జులై 19)న అరెస్టు చేసిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిధున్ రెడ్డి పేరును ఈ చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. మిథున్ రెడ్డిని ఆదివారం (జులై 20) న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరే అవకాశం ఉంది. .


.webp)
.webp)


