పాపం.. పరీక్ష చివరి రోజున...

 

బుధవారం నాటితో తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. ఈరోజుతో పరీక్షలు ముగుస్తాయన్న ఆనందంలో ఉన్న ఒక విద్యార్థి ఊహించని విధంగా మృత్యువుపాలయ్యాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన మంద చందు (15) అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం చివరి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అయితే పరీక్షా కేంద్రానికి వెళ్ళేముందు మూత్ర విసర్జన కోసం పరీక్షా కేంద్రం పక్కనే వున్న రైల్వే ట్రాక్‌ని దాటే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో వరంగల్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ చందును ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu