Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...108 అడుగుల హనుమాన్.. విగ్రహం ఆవిష్కరించిన పీఎం..
posted on: Apr 16, 2022 12:49PM
దేశ వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రం మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలు దిక్కుల్లో నాలుగు భారీ హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రెండో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోడీ రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఇక ఉత్తరాదిన 2010లో సిమ్లాలో మొదటి భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు.






