Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విరాట్ కోహ్లికి 13 లక్షల జరిమానా...పదేపదే మాట్లాడుతున్నందుకు
posted on: Apr 23, 2016 3:28PM

క్రీజులో ఎక్కువ సేపు చర్చలతో టైమ్ గడుపుతున్నాడని చెప్పి విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. ఐపీఎల్ 9 సిరీస్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు విరాట్ కోహ్లి సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ వరకూ జట్టు ఓకే కానీ.. బౌలింగ్లో మాత్రం సరిగా రాణించలేకపోతున్నారు. దీంతో ఎంత భారీ స్కోర్ చేసినా ఫలితం లేకుండా పోతుంది. అందుకే క్రీజులో ఉన్నప్పుడు కోహ్లి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో తెలీక మాటిమాటికి జట్టులో సీనియర్లు డివిలియర్స్, వాట్సన్ తో చర్చలు జరుపుతున్నాడట. అది కూడా ఒకటి, రెండుసార్లు కాకుండా.. ప్రతి ఓవర్ కి అలా చేస్తుండటంతో అది గమనించిన రిఫరీ అతనికి జరిమానా విధించారు. ఈ జరిమానా ఐపీఎల్ లో మారిన నిబంధనల ప్రకారం విధించారు. ఆ లెక్కన కోహ్లీకి 13.3 లక్షల రూపాయల జరిమానా విధించారు.






