Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెజవాడ గజ గజ...వంశీ, నెహ్రూల మధ్య కోల్డ్ వార్
posted on: Dec 10, 2012 4:56PM
.jpg)
విజయవాడలో రాజకీయ వాతావరణం మరలా వేడెక్కినట్లు కనిపిస్తోంది. నగర పరిధిలోని గుణదలలో నిన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ఆ పార్టీ నేత వల్లభనేని వంశీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమన్నంతా ఓ వ్యక్తి వీడియో తీయడమే ఇందుకు కారణం.
అనుమానం వచ్చిన పార్టీ నేతలు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. నగర కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రు అనుచరుడు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తే, ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడని రమేష్ అనే వ్యక్తి తెలుగు దేశం నేతలకు చెప్పాడు. దీనితో పార్టీ నేతలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో చిత్రాల ద్వారా నెహ్రు తన ఫై దాడి చేయాలని పధక రచన చేస్తున్నారని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అవసరం తమకు లేదని, కేవలం ప్రచారం కోసమే వంశీ ఈ ఆరోపణలు చేస్తున్నారని నెహ్రు వర్గీయులు తిప్పి కొట్టారు.
ఏది ఏమైనా గుణదలలో ఏ చిన్న రాజకీయ కార్యక్రమం జరిగినా అక్కడి సాధారణ ప్రజానీకం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పరిస్థితి దృష్ట్యా పోలీసులు కూడా బారీ ఎత్తున బలగాలను మొహరిస్తూఉండడంతో అక్కడ ప్రజలలో ఆందోళనలు నెలకొని ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు నేతలు మాటల యుద్దానికి తలపడుతూ ఉండటం సహజంగా మారింది.
ఇలా ఒకరి కార్యకలాపాలఫై మరొకరు నిఘా పెట్టడంతో విజయవాడ రాజకీయాలు మరలా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


.jpg)
.jpg)


