దారుణం.. ఆరుగురు చిన్నారులు సజీవదహనం..

 

ఉత్తర్‌ప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్లోని రాయ్‌బరేలీలో క్విలా పోలీసు స్టేషన్ పరిధి కాళీధామ్ ఆలయ సమీపంలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం సంభ‌వించి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని.. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న కొవ్వొత్తి వల్లే మంటలు వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న చిన్నారులు సజీవదహనమయ్యాయని పోలీసులు భావిస్తున్నారు.