టీడీపీ మహానాడు ప్రారంభం..

 

తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు కార్యక్రమానికి వచ్చారు. పార్టీ పతాకం ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఇంకా సభా ప్రాంగణంలో త్రీడీ షో, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివస్తున్నారు. దీంతో తిరుపతి నగరం పసుపుశోభతో నిండిపోయింది. కాగా జాతీయ పార్టీగా ఏర్పడిన తరువాత టీడీపీ తొలి మహానాడు ఇదే. కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది హాజరవుతున్న నేపథ్యంలో అందరికి ఘుమఘుమలాడే వంటకాలు అందిస్తున్నారు.