అగస్టా వెస్ట్ ల్యాండ్..మరో విషయం బయటపెట్టిన సుబ్రహ్మణ్యస్వామి
Published on: Fri Apr 29, 2016 12:37PM
.jpg)
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్లో కుంభకోణం ఆందోళనలతో ఇప్పటికే పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రోజుకో కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. అగస్టా నుంచి తీసుకున్న ముడుపులను సోనియా గాంధీ... జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో దాచుకున్నారని.. ఇందులో కొంత మొత్తాన్ని అక్కడి నుంచి తరలించిన సోనియా గాంధీ... ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ చేశారన్నారు. ఈ రెండు బ్యాంకుల ఖాతాలను పరిశీలించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీపై కేసులు నమోదు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. మరి దీనిపై ప్రతిపక్షం ఎలా స్పదింస్తుందో చూడాలి.


