అన్నదమ్ముల్లా కలిసుండాలి: సోనియా!

posted on: Jul 31, 2013 7:27PM

 

sonia gandhi telangana, sonia gandhi T congress, T congress ministers sonia gandhi

 

 

సీమాంధ్ర ప్రాంతం వారు మీ సోదరులేనని, సంయమనం పాటించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని సోనియా సూచించారని, అనివార్యమై విభజనపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారని అన్నారు. ఏ సమస్యనైనా ఇరు ప్రాంత నేతలు చర్చించి పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలు వాటిల్లకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పారన్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయమని సూచించారన్నారు. తెలంగాణపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తాము సోనియాకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. తీర్మానానికి సహకరించిన సీమాంధ్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...