అసెంబ్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి

టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై అవినీతి వలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీ చేరుకున్నారు. టీడీపీ, జీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆయన ఓటు వినియోగించుకున్న అనంతరం పోలీసులు నేరుగా అతనిని చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.