రామ్ చరణ్ తో 'మిర్చి' డైరెక్టర్ మూవీ
posted on: Apr 29, 2013 2:15PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిర్చి తో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివకి మెగా ఛాన్స్ దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకేక్కి౦చబోతున్నాడు. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత. మే నెల రెండో వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో ‘జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదల కానుంది. కాని ‘తుఫాన్' వివాదాల్లో ఇరుక్కోవడంతో 'ఎవడు' రిలీజ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.




.jpg)


