ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ 20 కోట్లు!
posted on: May 25, 2013 12:35PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో రూపొందుతున్న 'బహుబలి' కోసం ప్రభాస్ కి భారీ పారితోషకం ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. దీంతో తెలుగులో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ ఈస్థాయి పారితోషకం తీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని, ఇంతే సమయంలో ప్రభాస్ కనీసం మూడు సినిమాలను పూర్తి చేసుకొనే అవకాశాన్ని మిస్ అయినట్టేనని వీరి వాదన!



.jpg)


