ప్రజల పై విద్యుత్ భారం రూ.6500 కోట్లు
posted on: Mar 30, 2013 6:17PM

విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.6500 కోట్ల భారం పడనుంది. 2013-14 విద్యుత్ టారిఫ్ను ఈఆర్సీసీ ఈ రోజు విడుదల చేసింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారిపై ఈఆర్సీ కనికరం చూపింది. వ్యవసాయ విద్యుత్లో ఈఆర్సీ ఎలాంటి మార్పు చేయలేదు. విద్యుత్ చార్జీలపై ఇప్పటికే టిడిపి ఇతర వామపక్షాలు ఏప్రిల్ తొమ్మిదిన బంద్ కు పిలుపు ఇవ్వడమే కాకుండా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన విద్యుత్ చార్జీలు సోమవార౦ నుండి అమలుకానున్నాయి.



.jpeg)
.jpg)


