Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీకి బెదిరింపు కాల్!
posted on: Jun 23, 2025 2:54PM
.webp)
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావుకు పీపుల్స్వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్కాల్ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు.
సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్కి, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



.webp)


