రోజా సస్పెన్షన్ పై చంద్రబాబు, జగన్ కు సుప్రీం చురకలు..
posted on Apr 22, 2016 4:04PM
వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీ కోర్టులో గురవారం, శుక్రవారం వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రోజా సస్పెన్షన్ పై వాదనలు విన్న అనంతరం.. రోజా సారీ చెప్పాలని.. అసెంబ్లీదే తుది నిర్ణయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే రోజా సస్పెన్షన్ పై అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి.. అర్ధిక లోటుతో ఉండి... కనీసం రాజధాని కూడా లేకుండా ఉన్న ఏపీ అభివృద్ధికి ప్రయత్నించకుండా ఇరు పార్టీల అధినేతలు పట్టుదలతో వ్యవహరించడం తగదని అన్నారు. ఇంకా ఎన్నో సమస్యలు రాష్టానికి ఉన్నాయి.. కేంద్రం నుంచి విభజన హామీలు కూడా చాలా అమలు కావాల్సి ఉంది.. వాటిని సాధించడానికి ప్రయత్నించాలని కానీ.. ఇలాంటి వాటికోసం సమయం వృధా చేసుకోవడం ఏంటని హితవు పలికింది.