మోడీ ప్రసంగం విలువ ఐదు రూపాయలేనా?

posted on: Jul 16, 2013 2:25PM

 

Manish Tiwari hits out at Modi, Manish Tewari Narendra Modi

 

 

కేంద్రమంత్రి మనీష్ తివారి బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. నరేంద్రమోడీతో హైదరాబాద్ లో బీజేపీ యువ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే దానికి ఎంట్రీఫీజుగా ఐదు రూపాయలను నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. స్వాముల ప్రవచనాలకు వంద నుండి లక్ష రూపాయలు ఉంటుందని, పరాజయం పాలయిన సినిమాకు కూడా రూ. రెండు వందల నుండి ఐదు వందలు ఉంటుందని, అలాంటిది మోడీ ప్రసగం విలువ రూ.5 మాత్రమేనా ? అని ట్విట్టర్ లో ఆశ్చర్యపోయారు. వినడానికే బీజేపీ ఐదు రూపాయల పన్నువిధిస్తే.. ఇక 120 కోట్ల మందిపై మాట్లాడే పన్ను ఇంకెంత విధిస్తారోనని ఆయన ఎద్దేవాచేశారు. యువజన సదస్సుకు వసూలుచేసే ఫీజు మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...