తెలుగులోనే..బాలీవుడ్ వెళ్ళాను: మహేష్
posted on: Jun 5, 2013 5:14PM

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖడించారు. ఈ రోజు విజయవాడలో రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్ ను మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ..మరో పదేళ్ళ పాటు తెలుగులోనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి బాలీవుడ్ ప్రాజెక్ట్ లు చేయడంలేదని కూడా చెప్పారు.‘1 నేనొక్కడినే’ టైటిల్ వెనక వేరే ఉద్దేశ్యం లేదని, నేనే నెం.1 అని దాని పరమార్థం కాదని, అలాంటి నెంబర్ గేమ్ తనకు ఇష్టం లేదని, పరిశ్రమలో అందరూ ప్రేక్షకులను రంజింప చేయడానికే ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని, ఇందులో కొత్త లుక్ తో కనిపిస్తానని మహేష్ బాబు స్ఫష్టం చేసారు.


.jpg)



