నాగినీ డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన..

posted on: Apr 29, 2016 6:09PM

 

నిరసన తెలపాలంటే ఒకొక్కరికీ ఒక్కో పద్దతి ఉంటుంది.  అయితే మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు మాత్రం చాలా విచిత్రంగా.. నవ్వు తెప్పించే విధంగా తమ నిరసనను తెలియజేశారు. అసలు సంగతేంటంటే.. మహారాష్ట్రలోని బుల్దానా టౌన్ లో రోడ్డు పనులు రెండేళ్లుగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో.. విసుగెత్తిపోయిన ఎన్సీపీ కార్యకర్తలు పీడబ్బ్యూడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు తమ ఫిర్యాదు అందజేశారు. అయితే, ఈవిషయమై అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఎన్సీపీ కార్యకర్తలు నాగినీ డ్యాన్స్ చేస్తూ తమ నిరసనను తెలియతజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...