Latest News
లాలూ కూతురికి ఈడీ సమన్లు..
posted on: May 24, 2017 5:17PM
.jpg)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి చెందిన డొల్ల కంపెనీల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ కేసులో ఛార్టెర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మీసా భారతి , ఆమె భర్తకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. రూ.8 వేల కోట్ల దుర్వినియోగం కేసులో సమన్లు జారీ చేశారు.


.jpg)
.jpg)


