నాగపూర్ టెస్ట్ : ధోని 99 అవుట్, భారత్ 297/ 8

 

Kohli, Dhoni half centuries, Kohli and Dhoni continue resistance, Kohli, Dhoni lead India charge

 

నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 8 నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంకా ఇండియా 33 పరుగులు వెనుకబడి ఉంది. ధోని ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 99 పరుగులు వద్ద ధోని రనౌటయ్యాడు. విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 289 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతడికిది మూడో సెంచరీ. కోహ్లికి తోడు ధోని రాణించడంతో భారత్ గౌరవ ప్రధామైన స్కోరు చేయగలిగింది. జడేజా(12), ధోనీ (99), చావ్లా(1) వెంటనే అవు టయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ నాలుగు, స్వాన్ మూడు వికెట్లు తీశారు.