తుని అరెస్టులపై ముద్రగడ నిరాహార దీక్ష.. పురుగుల మందు పట్టుకొని

 

కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని ఘటనలో తననూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అరెస్టులను నిరసిస్తూ ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు పట్టుకొని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఆయన పక్కనే ఆయనసతీమణి, ఇతర కుటుంబ సభ్యులు కూర్చున్నారు. అమలాపురం పోలీసు స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై పోలీసులు ముద్రగడపై కేసు నమోదు చేశారు. కానీ ముద్రగడ మాత్రం తాను తుని ఘటనలో అయితేనే అరెస్టవుతానని ముద్రగడ మొండికేస్తున్నారు. తనపై ఉన్న కేసుల వివరాలు చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తనను అరెస్టు చేస్తే జైల్లోనే దీక్ష చేస్తానని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అరెస్టు చేయాలని అడిగితే చేయకుండా దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అడిగారు.