మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు పై కేసు

 

 

Kidnapping Case filed against Minister Mukesh Goud Son, Kidnapping Case Minister Mukesh Goud's Son

 

 

రాష్ట్ర మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తమను విక్రమ్‌గౌడ్ తన మనుషులతో వచ్చి కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విక్రమ్‌పై కేసు నమోదు చేశారు. దెబ్బలు తిన్న ఇద్దరు యువకులు ఓ పబ్ యజమానులు. మరో భాగస్వామితో  వచ్చిన వ్యాపారా విబేధాల్లో విక్రమ్ తలదూర్చారని, తమపై దాడికి పాల్పడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విక్రమ్‌ గౌడ్ తోపాటు మరో ముగ్గురు వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.